శ్రీరామునికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముస్లిం మహిళ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట (Ellanthakunta) మండల కేంద్రంలోని సీతా రామచంద్ర స్వామికి ఓ ముస్లిం మహిళ శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించింది. జమ్మికుంట పట్టణానికి చెందిన భాను లేడీస్ టైలర్ నిర్వాహకురాలు అబేధాబాను పట్టు వస్త్రాలను తలంబ్రాలతో బుధవారం ఆలయ అధికారులకు అప్పగించారు. ముస్లిం మహిళ పట్టు వస్త్రాలు సమర్పించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ మతసామరస్యాన్ని చాటిందని అభినందించారు.

Read Also: పీఆర్సీ అంశంలో ఉద్యోగులకు మళ్ళీ నిరాశే !!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>