కలం, వెబ్ డెస్క్ : మార్కాపురం బస్సు ప్రమాదంలో (Bus Accident) అనేక విషాద ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా మంది భర్తలను కోల్పోయారు. ఇంకొంత మంది పిల్లల్ని కోల్పోయారు. ఇంకొందరు కొడుకులను, ఇంకొదరు భార్యలను.. ఇలా ఒకటా రెండా.. మనసులు కలిచి వేస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ బస్సు ప్రమాదంలో అందరితో కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన ఒకటి ఉంది. ఓ మహిళ తన భర్తను, 5 నెలల కొడుకును కోల్పోయింది.
సదరు మహిళ తన కొడుకు, భర్తతో కలిసి స్వగ్రామానికి వెళ్తూ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భర్త, కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. ఆ మహిళ మాత్రం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇలాంటి విషాద ఘటనలు ఎన్నో మార్కాపురం బస్సు ప్రమాదంలో ఉన్నాయి.
Read Also: సైబర్ నేరగాళ్ల వలలో ప్రొఫెసర్.. కోటి రూపాయలు గోవిందా!
Follow Us On: Youtube

