కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీ (Moinabad Drugs Case) రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ తో పాటు మందు పార్టీ జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఫామ్ హౌస్ లోకి వెళ్ళగానే మొదటగా బుల్లెట్ సౌండ్ వినబడిందని.. బుల్లెట్ సౌండ్ విని వెంటనే మేమంతా అప్రమత్తమయ్యామని తెలిపారు. తాము పోలీసులమని, తమని కాల్చవద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచామని తెలిపారు. తాము చెప్తున్నప్పటికీ కూడా మరో రెండు సార్లు బుల్లెట్ సౌండ్ వినిపించిందన్నారు. మరోవైపు ‘మీరు కాల్పులు జరపాండి నేను మొత్తం చూసుకుంటాను.. ఏం జరిగినా నాదే బాధ్యత’ అంటూ గట్టిగా ఒకరి వాయిస్ వినపడిందని చెప్పారు.తామంతా గట్టిగా అరిచేసరికి ఒకసారిగా ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయిందని రిపోర్ట్ లో తెలిపారు.
‘మేమంతా ఒకసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్ హౌస్ సెర్చ్ చేసేందుకు అప్పటికే మేము వారెంట్ తీసుకోవడం జరిగింది. ఫామ్ హౌజ్ లోకి ఎంటర్ కాగానే వెంటనే సెర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి (Pilot Rohith Reddy) ఇచ్చాము. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకిని మేము స్వాధీనం చేసుకున్నాము. బుల్లెట్ షెల్స్ పట్టుకొని మరొకరు ఉన్నారు.. అతని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటు పది మందిని అదుపు తీసుకున్నాం. జర్మన్ లో తయారు చేయబడిన రివాల్వర్ పాయింట్ 32ని స్వాధీనం పరుచుకున్నాం. 11 మందిని విడివిడిగా పెట్టి విచారణ జరిపాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదేపదే విచారించడంతో చివరికి సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ (Moinabad Drugs Case) తీసుకున్నట్టుగా ఒప్పుకున్నాడు. అతని చెక్ చేసినప్పుడు రెండు గ్రాముల కొకైన్ బయటపడింది. కొకైన్ ఎవరు తెచ్చారు అనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదు. పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది. ఈ డ్రగ్స్ కోసం కొంత డబ్బుని కొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ ఒప్పుకున్నాడు. కొకైన్ తానే తెచ్చానని కౌశిక్ ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్ ట్రిప్ కు వెళ్ళినప్పుడు తాను కోకైన్ తీసుకొని వచ్చానని చెప్పాడు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్ కొన్నట్టు తెలిపాడు’ అని పోలీసులు వివరించారు.
ఫామ్హౌస్ డ్రగ్స్ పార్టీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు ఏం చెప్పారంటే:
డ్రగ్ పార్టీ కోసమే కొకైన్ ను తీసుకువచ్చినట్లు కౌశిక్ చెప్పాడు..
ఒక్కొక్క గ్రామ్ కి 15000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ చెప్పాడు..
11 మందికి డ్రగ్ లైవ్ కిట్టు ద్వారా టెస్టులు చేశాం.
అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ రోహిత్ రెడ్డి లకు డ్రగ్ పాజిటివ్గా వచ్చింది.
కాల్పులు జరిపిన నమిత్ శర్మని అరెస్ట్ చేశాము.
పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్ గా గుర్తించాం.
లైసెన్సు రివాల్వర్ నితీష్ రెడ్డి వద్ద ఉండాల్సింది నమిత్ శర్మ వద్దకు వచ్చింది.
ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిగినట్లు నమిత్ శర్మ చెప్పాడు.
ఫామ్ హౌస్ లోకి వస్తున్న పోలీసులు భయభ్రాంతులకు గురిచేసినందుకే కాల్పులు జరిపినట్లు తెలిపారు.
కాల్పులు జరిపి ఫామ్ హౌజ్ నుంచి తప్పించుకొని పారిపోవాలని ప్లాన్ చేశారు.
కాల్పులతో పోలీసుల్ని తీవ్రంగా గాయపరచాలని అనుకున్నారు.
పార్టీలో ఉన్నవాళ్లు లిక్కర్ తో పాటు డ్రగ్స్ వాళ్ల తీసుకున్నట్లు ఒప్పుకున్నారు.
రెండవ ఒపీనియన్ కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ మళ్లీ రత్నమునాలతో పరీక్షలు నిర్వహించాం.
రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు ఎంపీ పుత్త మహేష్ కుమార్ కి డ్రగ్ పాజిటివ్ వచ్చింది.
నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడింది.
పైలట్ రోహిత్ రెడ్డి రితేష్ రెడ్డి అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్ట్ వచ్చింది.
ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చింది.
నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి ,రితేష్ రెడ్డి, పుత్త మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి , కౌశిక్ రవి లకు డ్రగ్ పాజిటివ్ వచ్చింది.
మద్యం కొకైన్ కలుపుకొని తాగడం జరిగింది.
పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ముందుగానే సమాచారం ఇచ్చాడు.
పైలట్ రోహిత్ రెడ్డి ఆహ్వానాని అందుకొని అందరూ అక్కడికి వచ్చారు.
Read Also: IIHFW చైర్పర్సన్గా నిజామాబాద్ డాక్టర్ కవితారెడ్డి
Follow Us On: X(Twitter)

