epaper
Monday, January 19, 2026
spot_img
epaper

కీరవాణికి అరుదైన గౌరవం

కలం, వెబ్​డెస్క్​: ఆస్కార్​ అవార్డు విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) కి అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధాని వేదికగా ఈ నెల 26న జరగబోయే 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్​కు సంగీతం అందించే అవకాశం ఆయనకు లభించింది. ఈ మేరకు కీరవాణి తన ‘ఎక్స్​’ అకౌంట్​లో వెల్లడించారు.

‘అందరికీ వందేమాతరం! ప్రతిష్టాత్మక గీతం వందేమాతరానికి 150 ఏళ్లు అవుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జనవరి 26న రిపబ్లిక్​ డే పరేడ్​కు సంగీతాన్ని స్వరపరిచే అవకాశం నాకు లభించడం ఎంతో గర్వంగా, గౌరవంగా ఉంది. ఈ మహత్తర కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 2,500 మంది కళాకారులు పాల్గొంటారు. మన దేశ ఆత్మను ప్రతిబింబించే ఈ వేడుకను ఆస్వాదించండి. వందేమాతరం’ అంటూ తన ట్వీట్​లో కీరవాణి పేర్కొన్నారు.

కాగా, రిపబ్లిక్​ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల రిహార్సల్స్ ఇప్పటికే​ ఢిల్లీలోని కర్తవ్యపథ్​లో మొదలయ్యాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు యూరోపియన్​ కౌన్సిల్​ ప్రెసిడెంట్​ ఆంటోనియో లూయిస్​ శాంటోస్​ డ కోస్టా, ​యూరోపియన్​ కమిషన్​ ఛైర్మన్​ ఉర్సులా వాన్​ డర్​ లియెన్​ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. వీళ్లు జనవరి 27 నుంచి జరగబోయే ఈయూ–ఇండియా భాగస్వామ్య సదస్సులోనూ ప్రతినిధులుగా పాల్గొంటారు.

MM Keeravani
MM Keeravani

Read Also: శర్వానంద్ సినిమాకు థియేటర్స్ పెంపు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>