కలం, వెబ్డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు (MLC Anantha Babu) కాకినాడ మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అనంత బాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. సాక్షులను ప్రభావితం చేశారన్న అభియోగాలపై అనంత బాబు అరెస్ట్ అయ్యాడు. సాక్షులను బెదిరించి, ప్రలోభ పెట్టాడనే ఆరోపణలతో ఎమ్మెల్సీ అనంత బాబుపై ఈనెల 21 పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు శుక్రవారం పోలీసులు అనంత బాబును అరెస్ట్ చేశారు. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంత బాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
Read Also: సోషల్ మీడియా కేసులు.. పులివెందులలో సజ్జల భార్గవ విచారణ
Follow Us On : WhatsApp

