Mobile Popup Ad
Mobile Popup Ad

గుమ్మడిదలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ (Gummadidala Municipality) లో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (Mahipal Reddy ) శంకుస్థాపన చేశారు. అన్నారం గ్రామంలోని 4వ వార్డులో ప్రకృతివనం కాలనీల ప్రధాన రహదారికి రూ.72 లక్షల 50 వేల నిధులతో CC రోడ్డు నిర్మాణ పనులను చేపట్టనున్నారు. ఈ నిర్మాణ పనులకు పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ మున్సిపాలిటీకి అభివృద్ధి కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. ఆ నిధులతోనే వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దశరథ్, చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ గోకర్ జయశంకర్ గౌడ్, చీమ్ముల గోవర్ధన్ రెడ్డి, గుమ్మడిదల మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>