కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ (Praja palana- Pragati Plan) కార్యక్రమం కీలకంగా నిలుస్తుందని మంత్రి సీతక్క (Seethakka) తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు.
ప్రజలందరూ ఈ ప్రగతి పాలన కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని ఆమె అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో పేద ప్రజలకు అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని సీతక్క (Seethakka) వెల్లడించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
Read Also: రూ. 22 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు: మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: Instagram

