కలం, వెబ్ డెస్క్: మంత్రి సీతక్క (Seethakka) బీజేపీ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్లు, అధికారం కోసం ఆ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి, వారిని నిలువునా చీల్చుతోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల ఐక్యతను దెబ్బతీస్తూ, సమాజంలో విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇదే క్రమంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే గొంతుకలను అణచివేస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. దేశ ప్రయోజనాల కంటే అధికారమే పరమావధిగా బీజేపీ (BJP) వ్యవహరిస్తోందని సీతక్క పేర్కొన్నారు.

