కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఆర్టీసీ (TGSRTC) ప్రయాణికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీపి కబురు అందించారు. ప్రయాణికులు మరింత సులభంగా, డిజిటల్ పద్ధతిలో టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలుగా “మీ సేవ మొబైల్ యాప్ను ఆయన ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా సుదూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులతో పాటు, ఇంటర్సిటీ బస్సులకు కూడా ముందస్తుగా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ యాప్లో మొత్తం 1,710 బస్సు సేవలు అందుబాటులో ఉండగా, మీసేవ మొబైల్ ప్లాట్ఫామ్ ద్వారా టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసుకోవచ్చు.

