కలం, డెస్క్ : ఏపీ ప్రభుత్వం (AP Govt) 50మంది డిప్యూటీ కలెక్టర్లను, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. వివిధ హోదాల్లో, బాధ్యతల్లో ఉన్న వీరిని రెగ్యులర్ ట్రాన్స్ ఫర్ విధానంలోనే బదిలీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల పని విషయాల్లో వస్తున్న ఫీడ్ బ్యాక్, పరిపాలనా సౌలభ్యాలను దృష్టిలో పెట్టుకుని వెంటనే ఆయా అధికారులు బదిలీ అయిన చోటుకు వెళ్లిపోవాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.

