‘రైతు మేళా’ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి

కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ (Hanumakonda) జిల్లాలో రాష్ట్రస్థాయి రైతు మేళా (Rythu Mela) ప్రారంభమైంది. హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల వేదికగా ఏర్పాటు చేసిన ఈ మేళాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో నేటి (మంగళవారం) నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

అయితే ఈ మేళాలో ఆధునిక సాగు పద్ధతులు, డ్రోన్ల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అంతే కాకుండా రైతులు నేరుగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>