కలం, ఖమ్మం బ్యూరో : జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో సీపీఐతో స్నేహ పూర్వక పోటీ మాత్రమే ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) స్పష్టం చేశారు. మంగళవారం ఖమ్మం (Khammam) లో జరిగిన మీడియా చిట్ చాట్ లో పొంగులేటి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల వరకే సీపీఐ (CPI) తో పోటీ ఉంటుందని, తర్వాత ఎప్పుడైనా కలిసే అవకాశం ఉందన్నారు. సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో వేరు వేరుగా పోటీ చేయడాన్ని శత్రువులుగా చూడొద్దని అన్నారు. సీపీఐతో కాంగ్రెస్ మళ్ళీ కలుస్తుందని.. విడిపోయామని విపక్షాలు ఎందుకు నోరు పారేసుకుంటున్నాయో వారికే తెలియాలని అన్నారు.
Read Also: రూ. 1511 కోట్ల విలువైన భూమిని రక్షించిన హైడ్రా
Follow Us On: X(Twitter)


