epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాజధానిని మూడు ముక్కలాటగా మార్చారు : మంత్రి నారాయణ

కలం, వెబ్​ డెస్క్​ : ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి నిర్మాణం 2014 నుంచే ప్రారంభమైందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి నారాయణ (Minister Narayana) తెలిపారు. అయితే ఆ తరువాత వచ్చిన జగన్​ ప్రభుత్వం రాజధానిని మూడు ముక్కలాటగా మార్చిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారాయణ కౌంటర్​ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో పనులు జరుగుతున్నాయని.. ఇప్పుడైనా వెళ్లి చూడాలని సజ్జలకు మంత్రి సూచించారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే రాజధాని నిర్మాణం ఆలస్యం అయిందని, ఇప్పుడు ఆ లోటును పూడ్చే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. తమకు రాజధాని అమరావతియేనని.. వైసీపీ రాజధాని ఎక్కడుందో చెప్పాలని  నారాయణ డిమాండ్​ చేశారు.

Minister Narayana
Minister Narayana

Read Also: ప్రజలు బుద్ది చెప్పినా జగన్ తీరు మారలేదు : చంద్రబాబు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>