కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) డేటా సెంటర్స్ పై ఉన్న భిన్న అభిప్రాయాలపై స్పందించారు. ఈ అంశంపై రెండు విభిన్న దృక్పథాలు ఉన్నాయని, వాటిని సమతుల్యంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలలో అమలవుతున్న మోడల్స్ను నేరుగా భారతదేశంలో అనుసరించడం సాధ్యం కాదని లోకేశ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని విధానాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. డేటా సెంటర్స్ అభివృద్ధిపై సమగ్ర, సమాచార ఆధారిత చర్చ అవసరమని పేర్కొన్నారు. భావోద్వేగాలకు లోనుకాకుండా వాస్తవాల ఆధారంగా విధాన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ను డేటా సెంటర్ హబ్గా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.

