కలం, వరంగల్ బ్యూరో: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వరంగల్ (Warangal) తూర్పు నియోజకవర్గం శివనగర్లోని సాయి ఫంక్షన్ హాల్లో శనివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ (Konda Surekha) 248 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ లను అందజేశారు. ఈ సందర్భం గా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యా రాణి, బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ లు సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, చింతాకుల అనిల్ కుమార్, కావేటి కవిత, పోశాల పద్మ, భోగి సువర్ణ, బైరబోయిన ఉమా, పల్లం పద్మ, దిడి కుమార స్వామి, వస్కుల బాబు మరుపల్ల రవి, అధికార యంత్రాంగం పాల్గొన్నారు.

