నేటి సాయంత్రం నుంచి “మీ సేవ” లు బంద్!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి “మీ సేవ”(Mee Seva) కేంద్రాలు మూసి వేయనున్నట్లు డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వర్ రావు తెలిపారు. ఏప్రిల్ 5న ఉదయం 8 గంటలకు సేవలు తిరిగి ప్రారంభిస్తామ‌న్నారు. కావున ప్రజలు ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకూ “మీ సేవ” లో ఏదైనా పని ఉంటే చేసుకోవాలని పేర్కొన్నారు.

“మీ సేవ” ల పని తీరు మెరుగుపరిచి, భద్రతకు సంబంధించిన వ్యవస్థలను పటిష్టం చేయడం కోసం 40 గంటలపాటు ఆన్‌లైన్‌ సేవలు నిలిపివేయనున్నట్లు సైదేశ్వర్ రావు తెలియజేశారు. భవిష్యత్తులో వేగవంతమైన, అంతరాయం లేని సేవలను అందించేందుకు ఈ చర్యలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. కాగా, ఇప్పటికే “మీ సేవ” కేంద్రాల ద్వారా అందించే సేవలకు సంబంధించిన ఛార్జీలను ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>