epaper
Saturday, January 17, 2026
spot_img
epaper

జిల్లా అంతా మహిళలే చైర్మన్లు

కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ప్రకటించిన నేపధ్యంలో మెదక్ (Medak) జిల్లాలో ఆసక్తికరమైన రిజర్వేషన్లు కేటాయించారు. మెదక్ జిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు (మెదక్, రామయంపేట, నర్సాపూర్, తూప్రాన్) ఉండగా, ఈ నాలుగు మున్సిపాలిటీలు కూడా మహిళలకే కేటాయించబడ్డాయి. అందులోనూ మూడు మున్సిపాలిటీలు జనరల్ మహిళగా రిజర్వ్ కావడం విశేషంగా చెప్పవచ్చు.

మెదక్ – బీసీ మహిళ,
రామయంపేట- జనరల్ మహిళ
నర్సాపూర్-జనరల్ మహిళ
తూప్రాన్- జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి.

దీంతో ఏ పార్టీ గెలిచిన మెదక్ జిల్లాలో మున్సిపల్ పీఠంపై చైర్మన్లుగా మహిళలలే కొలువు దీరనున్నారు. మెదక్ జిల్లా అంతా నారీమణులు మాత్రమే పరిపాలించనున్నారు. ఇప్పటికే నర్సాపూర్ ఎమ్మెల్యేగా సునీతా లక్ష్మరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, మెదక్ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>