కలం, వెబ్ డెస్క్ : భార్యతో వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకున్న ప్రియుడి ఇంటికి భర్త నిప్పు పెట్టిన ఘటన మహబూబాద్ జిల్లాలోని గుండాల గడ్డ తండాలో చోటు చేసుకుంది. గ్రామంలోని లూనావత్ మల్పురు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమం సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంపై మహిళ భర్త.. ఊరి పెద్దలు, ప్రముఖుల వద్ద పలుసార్లు పంచాయితీలు పెట్టి హెచ్చరించాడు. అక్రమ సంబంధం ఆపాలని చెప్పాడు. అయినా తన తీరును మార్చుకోలేని మల్లూరు పై మహిళ భర్త జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంధువులతో కలిసి అతని ఇంటికి నిప్పు పెట్టాడు. దీంతో పాటు ట్రాక్టర్, హార్వెస్టర్లకు కూడా నిప్పంటించారు.


