epaper
Wednesday, February 18, 2026
epaper

2013 బెట్టింగ్ స్కామ్‌.. రూ.10 లక్షలు కట్టనున్న ధోనీ

కలం, వెబ్ డెస్క్: పన్నెండు ఏళ్ల పరువునష్టం కేసులో కీలక మలుపు. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) రూ.10 లక్షలు జమ చేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఆదేశించింది. ట్రాన్స్క్రిప్షన్, అనువాద ఖర్చుల కోసం ఈ మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది. 2013 ఐపీఎల్ (IPL) బెట్టింగ్ వివాదంలో తన పేరును లాగారని ఆరోపిస్తూ ధోనీ 2014లో రూ.100 కోట్ల దావా వేశారు. జీ మీడియా, సుధీర్ చౌధరి, రిటైర్డ్ ఐపీఎస్ జి. సంపత్ కుమార్, న్యూస్ నేషన్‌పై కేసు నమోదైంది. కోర్టులో సమర్పించిన సీడీల లిప్యంతరీకరణ పెద్ద పని అని ఇంటర్‌ప్రెటర్ విభాగం తెలిపింది.

మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందని అంచనా వేసింది. ఖర్చు రూ.10 లక్షలు అవుతుందని నివేదించింది. దీనిపై జస్టిస్ ఆర్.ఎన్. మంజులా, వాదినే ఖర్చు భరించాలని ఆదేశించారు. మార్చి 12, 2026లోపు చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్‌లో డిపాజిట్ చేయాలని సూచించారు. ఈ కేసు మధ్యంతర పిటిషన్లతో ఆలస్యం అయింది. కోర్టు ధిక్కారం కేసు (Contempt of Court), అప్పీలు, స్టేలు తర్వాత ఇప్పుడు విచారణ ముందుకు సాగే దశకు చేరింది. తదుపరి ప్రక్రియ కోర్టు షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది.

Read Also: అఫ్ఘాన్ స్టార్‌కి ఐసీసీ జరిమానా..

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>