లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కొమురవెళ్లి కార్యదర్శి

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. సోమవారం కొమురవెళ్లి (Komuravelli) గ్రామ పంచాయతీ కార్యాలయంపై ఏసీబీ (ACB) దాడులు నిర్వహించింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి గడ్డం రాజు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్య‌వ‌హారంలో కొమరవెల్లి గ్రామ సర్పంచ్ భర్త గొల్లపల్లి ఆంజనేయులుకు భాగ‌స్వామ్యం ఉన్న‌ట్లు చ‌ర్చ న‌డుస్తుంది. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. డ్రైనేజీ పైపులైన్ తొలగించే విషయంలో లంచం తీసుకుంటుండ‌గా గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>