కలం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ (PM Modi) ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి ఉగ్రవాదితో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. దక్షిణాది హక్కులను ప్రధాని మోదీ కాలరాస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని స్థాయి వ్యక్తిని ఉగ్రవాదితో పోల్చడం దారుణమని విమర్శిస్తున్నారు. మోదీని అవమానించడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటుగా మారిందని ఆరోపిస్తున్నారు.
Read Also: రేవంత్ తాబేదర్ల కోసమే ప్రజా పాలన : జీవన్ రెడ్డి
Follow Us On: Instagram

