కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) ఫైరయ్యారు. ‘హౌ డేర్ యు తేజస్వీ సూర్య’ అంటూ ఎక్స్లో ఆమె పోస్ట్ చేశారు. ఆరు దశాబ్దాల పోరాటాన్ని, వేలాది మంది అమరుల త్యాగాలను అవమానిస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా బీజేపీ నేతలంతా స్పందించాలని, లేదంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..
Follow Us On: X(Twitter)

