కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్ట రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర రైతు అధ్యక్షులు ఏలేటి నవీన్ రెడ్డి, ఆర్మూర్ నియోజవర్గ అడహక్ కమిటీ సభ్యులు మాక్నూర్ మనోజ్, సంతోష్, ఎం.సాయి, ఆర్మూర్ మండల జాగృతి నాయకులు నవీన్ యాదవ్, నవీన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

