కలం వెబ్ డెస్క్: మే డే సందర్భంగా మే 1న హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత జెండా ఎగురవేసిన కార్మిక సోదరులందరికీ మే డే (May Day) శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ.. శ్రమజీవుల హక్కుల కోసం పోరాటం చేస్తామని, కార్మికుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. తెలంగాణ రక్షణ సేన తరపున కార్మికులందరికీ పూర్తి రక్షణ కల్పిస్తామని కవిత భరోసా ఇచ్చారు.

