కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్లో ఈనెల 16వ తేదీన ‘జగన్నాథ రథయాత్ర’ (Jagannath Rath Yatra) మహెత్సవం నిర్వహించనున్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే (karimnagar MLA) గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ను కమిటీ ప్రతినిధులు వారి నివాసానికి వెళ్లి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరి శంకర్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, వైద్యులు రాజ భాస్కర్ రెడ్డి, ఎస్ ఆర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

