కలం, డెస్క్ : కరీంనగర్ (Karimnagar) బ్యాలెట్ బాక్సులో చిట్టాలు రావడం చర్చనీయాంశమైంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కోసం అధికారులు బ్యాలెట్ బాక్సులను తెరవగా.. అందులో కొన్ని చిట్టీలు కనిపించాయి. ఓపెన్ చూసి చూడగా.. డంపింగ్ యార్డు క్లీన్ చేయాలంటూ ఆ చిట్టీల్లో రాసి ఉంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరీంనగర్ డంపింగ్ యార్డు విషయంలో ఎన్నికల ప్రచారంలో కూడా లీడర్లు మాట్లాడారు. డంపింగ్ యార్డు సమస్య తీవ్రతను తెలియజేసేందుకే ఇలా చిట్టీలు రాసి పెట్టారేమో అని ప్రచారం జరుగుతోంది.


