కలం, వెబ్ డెస్క్ : ఉద్యోగం పేరుతో ఓ మహిళను దారుణంగా మోసం చేశాడు ఓ వ్యక్తి. డబ్బులు తీసుకుని ఉద్యోగంలో పెట్టించకపోతే.. తన డబ్బులు తిరిగి ఇవ్వాలని మహిళ నిలదీసింది. దీంతో తిరిగి మహిళపైనే దాడి చేశాడు సదరు వ్యక్తి. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ (Nashik) శివాజీనగర్ లో చోటు చేసుకుంది. 32 ఏళ్ల మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడు. రోజులు, నెలలు గడుస్తున్నా సరే ఉద్యోగం ఇప్పించట్లేదు.
దీంతో సదరు మహిళ తన డబ్బులు ఇవ్వాలంటూ కోరింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయింది. దీంతో మహిళపై దారుణంగా దాడి చేశాడు ఆ వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మోసం చేయడమే కాకుండా మళ్లీ దాడి చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు.

