కలం, జనగామ : జనగామ (Jangaon) మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం (Budget Meeting) తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ అభివృద్ధి పనులపై చర్చ జరిపి, బడ్జెట్ను ఆమోదించాల్సిన కీలక సమావేశం.. ప్రోటోకాల్ (Protocol) వివాదం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. సభలో వైస్ ఛైర్మన్కు ప్రత్యేకంగా సీటు కేటాయించకపోవడం ప్రధాన వివాదంగా మారింది. మున్సిపల్ నిబంధనల ప్రకారం గౌరవప్రదమైన స్థానం కల్పించకపోవడం ద్వారా వైస్ ఛైర్మన్కు అవమానం జరిగిందని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో వేదికపై వైస్ ఛైర్మన్ కూర్చోవడానికి సీటు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఉద్రిక్తత చెలరేగింది.
అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కౌన్సిలర్లు, బదులుగా ఒక్కసారిగా వాకౌట్ చేసి, మున్సిపల్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. మున్సిపల్ పాలకవర్గం, అధికారుల సమన్వయ లోపం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. బడ్జెట్ వంటి ముఖ్యమైన అంశంపై చర్చ జరగాల్సిన సందర్భంలో ఇలాంటి ప్రోటోకాల్ వివాదం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
Read Also: వరంగల్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ గురి.!
Follow Us On : WhatsApp

