కలం, వెబ్ డెస్క్: ఇటీవల జైలు నుంచి విడుదలైన పోక్సో (POCSO) కేసు నిందితుడు బండి భగీరథ్ (Bandi Bhagirath)ను పోలీసులు మళ్లీ జైలుకు తరలించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో భగీరథ్ను మే 16న పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ క్రమంలో భగీరథ్ తనకు బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయని, తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. జూన్ 20న మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గురువారంతో ముగిసింది. దీంతో పోలీసులు భగీరథ్ను అదుపులోకి తీసుకొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశ పెట్టారు. అనంతరం భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు.
Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!
Follow Us On: X(Twitter)

