Mobile Popup Ad
Mobile Popup Ad

మానవత్వమే ఇందూరు యువత సేవా తత్వం: మేయర్ ఉమారాణి

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీలో గత కొన్ని రోజులుగా ఓ వ్యక్తి మతి తప్పి విధివంచితుడుగా మారి పూర్తిగా కనుచూపును కోల్పోయాడు. పెరిగిన గడ్డం, అట్టలు కట్టిన జుట్టు, మల మూత్రాలతో ఒంటినిండ్డ పిడుచలు కట్టుకుపోయిన ఆ వ్యక్తి దగ్గరగా వెళ్ళాలంటేనే దుర్గంధం వస్తుంది. తనలో తానే మాట్లాడుకుంటాడు ఆ మాటల్లో పొంతన ఉండదు.. ఎవరేమి అడిగినా మూగ సైగలే.. అతని సమాధానం.

ఆ వ్యక్తి దయనీయ పరిస్థితిని గమనించిన నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమా రాణి.. వెంటనే ఆ సమాచారాన్ని ‘ఇందూరు యువత’ (Induru Yuvatha NGO) స్వచ్ఛంద సేవా సంస్థకు అందించారు. వెంటనే స్పందించిన సంస్థ ప్రతినిధులు, ఆదివారం ఆ వ్యక్తికి అవసరమైన సపర్యలు అందించారు. ఈ సందర్భంగా మేయర్ ఉమా రాణితో పాటు అక్కడి స్థానికులు సంస్థ ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు.

‘మానవత్వమే ఇందూరు యువత సేవా తత్వం’ అంటూ వారి సేవా నిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూరగాయల రమేష్, అనిల్, ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, దర్శనం రాజు, అఫ్రోజ్, సాయి, మనోహర్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>