Mobile Popup Ad
Mobile Popup Ad

స్లో ఓవర్ రేట్.. పాక్ జట్టుకు ఐసీసీ జరిమానా

కలం, వెబ్ డెస్క్ : ఆదివారం భారత్‌తో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) గ్రూప్-ఎ మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) జట్టుకు గట్టి షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టుపై ఐసీసీ (ICC) జరిమానా విధించింది. మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో, పాకిస్థాన్ జట్టు ఒక ఓవర్ వెనుకబడినట్లు అధికారులు గుర్తించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం, నిర్ణీత సమయానికి తక్కువగా వేసిన ప్రతి ఓవర్‌కు ఐదు శాతం చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టుపై ఐదు శాతం జరిమానా విధించారు.

ఈ క్రమంలోనే ఐసీసీ అంతర్జాతీయ మ్యాచ్ రెఫరీల ప్యానెల్‌కు చెందిన ట్రూడీ ఆండర్సన్ పాక్ జట్టుపై ఈ చర్యలు తీసుకున్నారు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు క్లైర్ పొలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్‌తో పాటు థర్డ్ అంపైర్ ఎలోయిస్ షెరిడాన్, ఫోర్త్ అంపైర్ సూ రెడ్‌ఫెర్న్ ఈ తప్పిదాన్ని గుర్తించి మ్యాచ్ రెఫరీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తమ జట్టు చేసిన పొరపాటును అంగీకరించారు. ఐసీసీ విధించిన జరిమానాను స్వీకరిస్తున్నట్లు వెల్లడించడంతో, ఈ వివాదం ఎలాంటి విచారణ అవసరం లేకుండానే ముగిసింది. ఈ ఘటనతో స్లో ఓవర్ రేట్ విషయంలో జట్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరోసారి స్పష్టమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>