కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro)పై శనివారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో బోర్డులో కీలక అధికారులను సర్కార్ నియమించింది. హైదరాబాద్ మెట్రో చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును (CS Ramakrishna Rao) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మెట్రో ఎండీగా సర్పరాజ్ అహ్మద్ కొనసాగనున్నారు. మెట్రో డైరెక్టర్లుగా జయేష్ రంజన్, వికాస్ రాజ్, సుల్తానియా, డీజీపీ శివధర్ ఉండనున్నారు. ఈ నిర్ణయంతో రేవంత్ సర్కార్ చేతికి హైదరాబాద్ మెట్రో రైలు వెళ్ళింది. ఈ మేరకు ప్రభుత్వం ఎల్అండ్టీ వాటాలను స్వాధీనం చేసుకుంది. ఈ నెల 30న రూ.15 వేల కోట్ల డీల్ పూర్తికి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో హైదరాబాద్ మెట్రో నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో ఎల్అండ్టీ (L&T) మెట్రోకు ఉన్న 100% ఈక్విటీని రేవంత్ సర్కార్ తన వశం చేసుకుంది. దీంతో పూర్తిస్థాయిలో ప్రభుత్వ యాజమాన్యం కిందికి హైదరాబాద్ మెట్రో వచ్చింది.
Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?
Follow Us On: Instagram

