కలం మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరు (Patancheru)లో దారుణం చోటు చేసుకుంది. పఠాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని APR laxuriya గేటెడ్ కమ్యూనిటీ ఫేస్ – 1, Villa No – 94 లో ఓ భర్త భార్యపై పలుసార్లు కత్తితో పొడిచి అనంతరం గొంతు కోసి దారుణంగా చంపేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అంబటి లీలావతి (60) ని భర్త అంబటి పరమేశ్వర్ రావు (70) కత్తితో దాడి చేసి హత్య చేశాడు. గత కొంతకాలంగా మతిస్థిమితం లేనట్టుగా ప్రవర్తిస్తున్న పరమేశ్వర్.. ఇంట్లో కొడుకు, కోడలు.. ఎవ్వరూ లేని సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

