కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ కూకట్పల్లిలో (Kukatpally) దారుణం చోటు చేసుకుంది. రహీం అనే వ్యక్తి తన భార్య సుమేరాను అత్యంత దారుణంగా చంపేశాడు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు తెలుస్తోంది. రహీం ఆటో డ్రైవర్గా పని చేస్తుండగా.. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం మరోసారి ఇలాగే జరగడంతో విచక్షణ కోల్పోయి కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

