కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్లో గత రాత్రి ఘోర బస్సు ప్రమాదం ( Bus Accident) జరిగింది. మధుర జిల్లా నౌఛెల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం చోటు చేసుకుంది. నోయిడా నుంచి బిహార్కి వెళ్తుండగా.. యమున ఎక్స్ప్రెస్వేపై స్లీపర్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 25 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 100 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

