కలం, డెస్క్ : హోలీ పండగపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మార్చి 3న మంగళవారమే హోలీ పండుగ జరుపుకోవాలని తెలిపింది. ఈ మేరకు స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీని కోసం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.48 గంటల దాకా ఉంటుంది. కాబట్టి గ్రహణం రోజు హోలీ (Holi) జరుపుకోవద్దని.. 4వ తేదీనే హోలీ పండగ జరుపుకోవాలంటూ పండితులు చెబుతున్నారు. దీంతో ప్రజల్లో హోలీ (Holi) పండగపై అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై తాజాగా ప్రభుత్వం 3వ తేదీనే జరుపుకోవాలని క్లారిటీ ఇస్తూ.. హోలీ సెలవు ప్రకటించింది.

