తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల నిరీక్షణ

కలం, వెబ్‌డెస్క్: తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల నేపథ్యంలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు వేచిఉన్నారు. నిన్న (శుక్రవారం) శ్రీవారిని 75, 688 మంది భక్తులు దర్శించుకోగా.. 38,264 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.354 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>