కలం, వెబ్డెస్క్: టీసీఎస్, ఇన్ఫోసిస్ తరఫున అమెరికాలో పనిచేస్తున్న హెచ్1బీ (H1b Visa) ఉద్యోగులకు గుడ్న్యూస్. ట్రంప్ ప్రభుత్వం పెంచిన హెచ్1బీ వీసా ఫీజు లక్ష డాలర్లను తమ ఉద్యోగుల తరఫున ఈ రెండు సంస్థలు భరించనున్నాయి. ఈ మేరకు టెక్ దిగ్గజాలు సమాయత్తమవుతున్నట్లు వాటి ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. అయితే, అదే సమయంలో కొత్త ఫీజు భారం తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజాలు హెచ్1బీ నియామకాలను కొంతమేర తగ్గించనున్నట్లు తెలుస్తోంది. కాగా, ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త ఫీజుపై న్యాయస్థానాల్లో కేసులు కొనసాగుతున్నందున ఇంకా అమల్లోకి రాలేదు. ఒక వారంలో దీనిపై కోర్టులు తుదితీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే తమ ఉద్యోగుల వీసా ఫీజు భరించాలని ఈ టెక్ దిగ్గజాలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే, అదే సమయంలో హెచ్1బీ వీసాల సంఖ్యను తగ్గించొచ్చు.
కాగా, ఏటా అమెరికా ఇచ్చే 85వేల హెచ్1బీ (H1b Visa) వీసాల్లో అధిక భాగం టీసీఎస్, ఇన్ఫోసిస్, సీటీఎస్ సొంతం చేసుకుంటున్నాయి. ఒక నివేదిక ప్రకారం మే 2020 నుంచి మే 2024 మధ్య ఈ సంస్థల తరఫున వచ్చిన హెచ్1బీ వీసా దరఖాస్తుల్లో 90శాతం ఆమోదం పొందాయి. ఈ మూడు కంపెనీల నుంచి దాదాపు 23వేల మందికి హెచ్1బీ వీసా ఆమోదం పొందింది. కొత్త ఫీజు అమల్లోకి వస్తే ఈ టెక్ దిగ్గజాలపై భారీగా భారం పడనుంది. అందుకే హెచ్1బీ వీసాలను కొంతమేర తగ్గించుకోవచ్చని అంటున్నారు. ఇది భారత్లోని ప్రతిభ కలిగిన ఉద్యోగులతోపాటు తక్కువ జీతానికి విదేశీ ఉద్యోగులను నియమించుకునే అమెరికా కంపెనీలకూ ఇబ్బందేనని విశ్లేషకులు అంటున్నారు.
Read Also: ఆ ఊర్లో 69 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నిక!
Follow Us On: Sharechat


