కలం, వెబ్ డెస్క్: భద్రాచలం (Bhadrachalam)లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మహా పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) హాజరయ్యారు. శనివారం మధ్యాహ్నం ఆలయానికి చేరుకున్న గవర్నర్కు ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ను శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ లక్ష్మీ తాయరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

