epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గూగుల్​ ఏఐ ప్లస్ వచ్చేసింది

కలం, వెబ్​డెస్క్​: భారత్​లో అతిపెద్ద ఏఐ మార్కెట్​ను సద్వినియోగం చేసుకొనే దిశగా గూగుల్​ మరో అడుగు వేసింది. ఈ టెక్​ దిగ్గజం ఏఐ ప్లస్​ (Google AI Plus) సేవలను ప్రారంభించింది. నెలవారీ సబ్​స్ర్కిప్షన్​ రూ.399గా ప్రకటించింది. కొత్తగా సబ్​స్ర్కిప్షన్ తీసుకునేవాళ్లు ఆరునెలల పాటు రూ.199కే ఈ సేవలు పొందొచ్చు. దీని ద్వారా అత్యాధునిక ఏఐ సేవల్ని తక్కువ ధరకు, మరింత సులభంగా అందుకోవచ్చని గూగుల్​ చెబుతోంది. ఈ ప్లాన్​ను ఫ్యామిలీ షేరింగ్ ద్వారా ఐదు మంది వాడుకోవచ్చు. ఇందులో అత్యాధునిక మోడల్ జెమినీ3 ప్రో వినియోగించుకోవచ్చు.

గూగుల్​ ఏఐ ప్లస్​ (Google AI Plus) ​కు అనుసంధానంగా ఉండే జెమినీ యాప్‌ ద్వారా కోడింగ్, అనువాదం, రైటింగ్, డ్రాయింగ్​, క్రియేటింగ్​, సొల్యూషన్స్​​ వంటివి మరింత వేగంగా, సమర్థంగా పొందవచ్చు. అలాగే చిన్న వీడియోలూ రూపొందించుకోవచ్చు. డాక్యుమెంట్ల విశ్లేషణ, వాటి సారాంశం చెప్పే గూగుల్ ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్ నోట్‌బుక్ ఎల్‌ఎం రీసెర్చ్​ యాక్సెస్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఫొటోలు, డ్రైవ్, జీమెయిల్‌పై కలిపి 200జీబీ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది.

Read Also: రేవంత్ OU పర్యటన వెనుక వ్యూహం ఏంటీ?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>