epaper
Monday, November 17, 2025
epaper

పసిడి ప్రియులకు షాకిస్తోన్న ధరలు

బంగారం ధర(Gold Prices) తగ్గుతుంది అని ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగులుతోంది. సామాన్యులు బంగారం వైపు చూడాలంటేనే భయపడేలా పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 21న చరిత్రలోనే తొలిసారిగా లక్ష మార్క్ దాటిన బంగారం ధర.. తగ్గు ముఖం చూడట్లేదు. తాజాగా 3 రోజుల్లోనే రూ.3 వేలకుపైగా పసిడి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షా 23 వేల520 కి చేరుకోగా… 22 క్యారెట్ల బంగారం ధర రూ. లక్షా 10 వేల700 కి చేరింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.లక్షా 50వేలు ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా సుంకాల పెంపు, యుద్ధ పరిస్థితుల వల్ల పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

Read Also: విటమిన్-Dకి మెదడుకు లింకేంటి..?
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>