కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ను డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy ) కలిశారు. DGP కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ మధ్య బాన్సువాడ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. తండ్రి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుభకార్యాలు అభివృద్ధి పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కార్యకర్తలు పేదల సమస్యలు పరిష్కరించడం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సందడి చేస్తున్నారు.

