కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లా నర్సాపూర్ (Narsapur) లో ఫుడ్ పాయిజన్ (Food Poison) కారణంగా 41 మంది అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి హల్దీ ఫంక్షన్ విందు భోజనం వికటించడంతో పలువురికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో 9 మంది, సంగారెడ్డిలో జిల్లా ఆస్పత్రిలో ముగ్గురు చిన్నారులతో పాటు మిగతావారికి వైద్యులు చికిత్స అందించి ఇంటికి పంపించేశారు.

