కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి(Sangareddy) జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం (Rudraram) గ్రామ పరిధిలో జాతీయ రహదారి 65 పక్కన ఉన్న కేపీఎల్ ట్రాన్స్ఫార్మర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలోని వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో మంటలు విస్తరించి ప్రమాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పడంతో కార్మికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

