సిద్దిపేటలో విషాదం.. యంత్రంలో వెంట్రుకలు చిక్కుకుని మహిళ మృతి!

కలం, మెదక్ బ్యూరో: పొట్టకూటి కోసం పనికి వెళ్లిన మహిళా కూలి పని ప్రాంతంలోనే ప్రమాదవశాత్తు ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన సిద్దిపేట (Siddipet) జిల్లాలో చోటుచేసుకుంది. చేర్యాల మండలం ఆకునూరు గ్రామ పరిధిలోని కాశీగుడిసెల్లో ఇమాంబి అనే మహిళా కూలి వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు శుభ్రం చేసేందుకు వెళ్లింది.

ఈ సమయంలో మహిళా కూలి తల వెంట్రుకలు ప్రమాదవశాత్తు వడ్లు శుభ్రం చేసే యంత్రంలో చిక్కుకున్నాయి. చూస్తుండగానే ఆ యంత్రంలోకి తలవెంట్రుకలు బలంగా వెళ్లి యంత్రం లోపల చుట్టుకున్నాయి. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>