కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) ఎక్సైజ్ SHO, RPF టీంలు ట్రైన్ లో తనిఖీలు నిర్వహించగా గంజాయి పట్టుబడింది. సంబల్ పూర్ నుండి నాందేడ్ వెళ్లే నాగావళి ఎక్స్ ప్రెస్ లో తనిఖీలు నిర్వహించారు. పూనం చంద్ శంకర్ రావ్ అనే వ్యక్తి వద్ద 1,33750/- రూపాయల విలువ గల 5.35 కిలోల గంజాయి లభ్యమైంది. ఆ గంజాయిని సీజ్ చేశారు. విశాఖపట్నం నుండి నాందేడ్ కు తీసుకుకెళ్తున్నట్టు విచారణలో తేలింది. గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ దాడిలో నిజమాబాద్ ఎక్సైజ్ ఇన్స్ పెక్టర్ స్వప్న, ఎస్సై మల్లేష్, సిబ్బంది మోహన్ సింగ్, గౌతమ్, దేవేందర్, రాజేందర్ పాల్గొన్నారు.

