epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఉద్యోగులకు బంపర్​ ఆఫర్​.. ఏడాదికి మూడు సార్లు పీఎఫ్​ విత్​ డ్రా

కలం, వెబ్​డెస్క్: కొత్త ఏడాదిలో ఉద్యోగుల ప్రావిడెంట్​ ఫండ్​​ విత్​ డ్రా (EPFO) కు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు అమలుకానున్నాయి. నిరుడు ఈపీఎఫ్​వో రూపొందించిన కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్​వో) సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ట్రస్ట్రీ ఆమోదంతో 2025 అక్టోబర్​లో వీటికి ఆమోదం లభించింది. విత్ డ్రాలను సులభతరం చేయడం, డిజిటల్​ ప్రక్రియలను వేగవంతం చేయడం, పదవీ విరమణ భద్రత కాపాడడం లక్ష్యంగా వీటిని రూపొందించారు.

ఏడాది సర్వీస్​ తప్పనిసరి..:

సాధారణంగా ఉద్యోగి, సంస్థ తరఫున జమ అయిన పీఎఫ్​ మొత్తంలో 75శాతం మాత్రమే (ఎలిజబుల్​ బ్యాలెన్స్​) విత్ డ్రా (EPFO) చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం పదవీ విరమణ ప్రయోజనాల కోసం కచ్చితంగా పీఎఫ్​ అకౌంట్​లో ఉంచాల్సిందే. విత్​ డ్రా కోసం ఇంతకుముందు 13 కారణాలు ఉండగా, ఇప్పుడు వాటిని మూడు విభాగాలుగా చేశారు. కేటగిరీ–1లో సామాజిక భద్రత కింద ఆరోగ్యం, చదువు, పెళ్లి; కేటగిరీ –2లో గృహావసరాలు(నిర్మాణం/కొనడం/హోమ్​లోన్​/రెనోవేషన్​); కేటగిరీ–3లో ప్రత్యేక పరిస్థితులు చేర్చారు.

కొత్త నిబంధనల ప్రకారం ఎలిజబుల్​ బ్యాలెన్స్ వంద శాతం విత్​ డ్రా చేసుకోవాలంటే ఏడాది సర్వీస్​ తప్పనిసరి. ఇది అన్ని కేటగిరీలకూ వర్తిస్తుంది. ఆరోగ్యావసరాలకు ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు విత్​ డ్రా చేసుకోవచ్చు. మొత్తం సర్వీస్​లో గరిష్ఠంగా చదువుకు పది, వివాహానికి ఐదు, గృహావసరాలకు ఐదు సార్లు తీసుకోవచ్చు. ప్రత్యేక పరిస్థితులలో (ఏ కారణంగా చెప్పకుండా) ఒక ఆర్థిక సంవత్సరంలో మూడు సార్లు విత్​ డ్రాకు అవకాశం ఉంటుంది. ఇక పదవీ విరమణ, శాశ్వత వైకల్యం, వీఆర్​ఎస్​, శాశ్వతంగా దేశాన్ని వదిలి వెళ్లడం వంటి సందర్భాల్లో పూర్తి విత్​ డ్రా చేసుకోవచ్చు.

Read Also: ‘SIR’​ ఎఫెక్ట్.. యూపీలో 2.8 కోట్ల ఓట్లు తొలగింపు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>