epaper
Wednesday, February 18, 2026
epaper

ముంబై రోడ్లపై పరుగులు తీసిన ఫ్రాన్స్​ అధ్యక్షుడు

కలం, వెబ్​ డెస్క్​: ఫ్రాన్స్​ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్​ మేక్రాన్​ (Emmanuel Macron) మంగళవారం ముంబై రోడ్లపై పరుగులు తీశారు. భారత పర్యటనలో భాగంగా ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఉదయం 11 గంటల సమయంలో కోస్టల్​ రోడ్​పై జాగింగ్​ చేశారు. ముంబైవాసులను ఆశ్చర్యంలో ముంచెత్తారు.

నేవీ బ్లూ టీషర్ట్​, షార్ట్​ ధరించి, సన్​ గ్లాసెస్​ పెట్టుకొని మేక్రాన్​ హుషారుగా పరుగు తీశారు. ఆయన వెంట కొంత మంది సెక్యూరిటీ సిబ్బందితోపాటు, ఫ్రెంచ్​ రాయబార కార్యాలయ అధికారులు ఉన్నారు. ఆయన వెళ్లిన మార్గంలో ప్రజలు, మీడియా వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే స్థానిక పోలీసులు ఏర్పాట్లు చేశారు. ముంబై రోడ్లపై మేక్రాన్​ జాగింగ్​ చేస్తున్న వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

26/11 మృతులకు నివాళి..

అంతకుముందు మేక్రాన్ (Emmanuel Macron)​, తన సతీమణి బ్రిగిట్​తో కలసి 26/11 మృతులకు నివాళి అర్పించారు. 2008 నవంబర్​ 26న పాక్​ ఉగ్రమూకలు దాడి చేయడంతో దక్షిణ ముంబైలోని తాజ్​ హోటల్​లో చాలా మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో చనిపోయినవాళ్లకు నివాళి అర్పించినట్లు మేక్రాన్​ ‘ఎక్స్​’లో పోస్ట్​ చేశారు.

ప్రధానితో భేటీ

అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (PM Modi) మేక్రాన్​ భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకున్న ప్రధాని మోదీని లోక్​భవన్​లో కలిశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక వాణిజ్య ఒప్పందంతోపాటు, రక్షణ తదితర అంశాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి. కాగా, భారత్​కు మేక్రాన్​ రావడం ఇది నాలుగోసారి. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్​ సమ్మిట్​కు (AI Impact Summit) మేక్రాన్​ హాజరవుతారు.

Read Also: జాతీయ రహదారుల వెంట ‘తేనెటీగ’ల కారిడార్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>