కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా చర్ల మండలంలోని సీ కత్తిగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం మేతకు వెళ్లిన మూడు పాడి గేదెలు విద్యుదాఘాతానికి గురై చనిపోయాయి. సీ కత్తి గూడెం గ్రామవాసి వెంబడి హరినాథ్కు చెందిన పాడి గేదెలు అకాల మరణం చెందటంతో, కుటుంబం జీవనాధారం కోల్పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, హరినాథ్ మాట్లాడుతూ.. “నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ తీగలు తెగి కింద పడ్డాయి. ఆ విషయం తెలియక మేతకు వెళ్లిన మా పశువులు మృత్యువాత పడ్డాయి. సుమారు 3.6 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మా కుటుంబానికి ఉన్న ఏకైక ఆధారం కోల్పోయాము,” అని బాధితుడు హరినాథ్ కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం స్పందించి, బాధిత రైతుకు తక్షణ ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

