కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్టం భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు (Earthquake) సంభవించడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కొత్తగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, పాల్వంచలో భూ ప్రకంపనలు వచ్చాయి. అర్ధరాత్రి 2 గంటల 26 నిమిషాల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.8గా నమోదు అయింది. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉండగా ప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

